మేడారం బస్సుల్లో ఉచిత ప్రయాణం

Date:

మేడారం జాతరకు నడిచే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణమే కలిపించారు. జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తిరస్కరించారు.

రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి భట్టి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. వచ్చే మేడారం జాతర సందర్భంగా తిరిగే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టిక్కెట్లు తీసుకుంటే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. ఇది సరికాదని, మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. మేడారం మాత్రమే కాకుండా ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టిక్కెట్లు తీసుకోవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...