రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నాం

Date:

ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామని, రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. భగవాన్‌ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని కేజ్రీవాల్‌ అన్నారు. ఛత్రసాల్‌ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని, రామరాజ్యంలో అందరూ తమ మతాన్ని పాటించేవారన్నారు. రామయణంలా రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వృద్ధులను అయోధ్య రామ దర్శనానికి పంపుతామని సీఎం ప్రకటించారు. రామాయణంలోని రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాముడు అనుసరించిన సూత్రాలను పాటించడం ముఖ్యమన్నారు.

విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, ఢిల్లీ ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామాలయానికి తమ ప్రభుత్వం త్వరలో యాత్రకు పంపనున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటి వరకు 83వేల మందికిపైగా వృద్ధులను తీర్థయాత్రలకు పంపామన్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్య యాత్ర ప్రారంభించాలని చాలా అభ్యర్థనలు వచ్చాయని, త్వరలోనే వీలైనంత మందిని అక్కడికి తీసుకెళ్తామన్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...