తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేసుకున్న వ్యక్తి మృతి

Date:

రెండు నెలల క్రితం మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా పంది కిడ్నీతో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకొని చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ మరణించారు. స్లేమాన్‌కు జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. అది సక్రమంగా పని చేస్తుండడంతో రెండు వారాల అనంతరం డిశ్ఛార్జ్‌ చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అతడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదు. ఈ నేపథ్యంలో రిచర్డ్‌ ఆకస్మిక మరణానికి శస్త్ర చికిత్సకు సంబంధం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ”రిచర్డ్‌ స్లేమాన్ మరణించడం పట్ల జనరల్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఇటీవల అతడికి చేసిన అవయవ మార్పిడి మూలంగా ఈ ఘటన జరగలేదని పరీక్షల్లో తేలింది. అయితే.. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి”అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...