పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం చేసిన హోంగార్డు

Date:

ప్రజలకు రక్షణగా ఉంటూ, ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం జరిగింది. అదే పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తోన్న వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనీ పట్టణంలో జరిగింది. పట్టణ రెండో పోలీసు స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును బీరువా లాకర్లో భద్రపరుస్తుంటారు. ఆ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్‌.. పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో బీరువా తాళాలు అతడికి ఇచ్చి ఫైల్స్‌ తీసుకురమ్మని చెప్పేవారు.

ఈ క్రమంలో బీరువాలో ఉంచిన నగదును చూసిన మనోజ్‌.. అందులోని రూ.5.63లక్షలు కాజేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు హోంగార్డుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...