తమిళనాడు బాణాసంచా కేంద్రంలో పేలుడు

Date:

వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు ఉన్నారు. తమిళనాడు విరుద్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా.. కెమికల్‌ మిక్సింగ్‌ రూములో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద స్థలిలోనే ఏడుగురు మరణించగా.., ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృత్యువాత పడినట్లు పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని శివకాశి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...