ఏఎస్ఐని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

Date:

ఇసుక మాఫియా అరాచకాలకు మరో ఏఎస్ఐ బలైపోయాడు. తాజాగా మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్‌ అధికారి బలయ్యారు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఏఎస్ఐ మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో షాదోల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఏఎస్ఐ మహేంద్ర బాగ్రీ.. ప్రసాద్‌ కనోజీ, సంజయ్‌ దూబే అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా ప్రాంతానికి వెళ్లారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌కు వారు అడ్డం తిరడంతో డ్రైవర్‌ ట్రాక్టర్‌ను ఆపకుండా తొక్కించాడు.

దాంతో ఏఎస్ఐ మహేంద్ర బాగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్‌లో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్‌ ఓనర్‌, ట్రాక్టర్‌ ఓనర్‌ కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్‌ ఓనర్‌ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్‌ ఓనర్‌ కోసం గాలిస్తున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...