మహారాష్ట్రలో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో నోట్ల కట్టల గుట్టలు వెలుగుచూశాయి. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తును ఆదాయపన్ను విభాగం స్వాధీనం చేసుకుంది. అందులో 8 కేజీల బంగారం, రూ.14 కోట్ల నగదు ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలతో నాందేడ్‌లోని ఆర్థిక లావాదేవీలు జరిపే సంస్థలపై ఈ సోదాలు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

పుణె, నాసిక్‌, నాగ్‌పుర్, పర్బని, ఛత్రపతి, శంబాజీనగర్‌, నాందేడ్‌కు చెందిన ఆదాయపన్ను విభాగం అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. 25 వాహనాల్లో వచ్చినవారు మే 10 నుంచి మే 12 వరకు ఆయా సంస్థలకు చెందిన పలు కార్యాలయాలతో పాటు యాజమాన్యానికి చెందిన వ్యక్తిగత నివాసాల్లోనూ సోదాలు చేశారు. నాందేడ్‌లో ఈ స్థాయిలో రైడ్స్ జరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో కోట్ల రూపాయిల సంపదను గుర్తించారు. దాంతో నిందితులపై అధికారులు తదుపరి చర్యలను ప్రారంభించారు. ఇదిలాఉంటే.. దొరికిన సొమ్మును లెక్కించడానికి 14 గంటల సమయం పట్టినట్లు సమాచారం. బస్తాల్లో ఉన్న డబ్బును బయటకు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...