ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య

Date:

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే తన స్వగ్రామం ఏటూరునాగారానికి పయనమైంది. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు కూలీ పనుల కోసం వెళ్లగా అక్కడ సుజాత మృతదేహాం కనిపించింది. దీంతో షాక్ గురైన వారంతా వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చినట్లుగా గుర్తించారు. అదేవిధంగా సుజాత ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్‌ఫోన్‌ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...