ఇంటికి వచ్చిన డెలివరీ పార్సిల్‌ పేలింది

Date:

ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండడంతో ఆన్ లైన్ బుకింగ్, ఆన్ లైన్ పార్సిల్ మామూలైపోయింది. అలాంటిది ఒక ఇంటికి డెలివరీ పార్సిల్ వచ్చింది. అది విప్పగానే ఒక్కసారి పార్సిల్‌ పేలింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌లోని వడాలిలో ఈ సంఘటన జరిగింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు పార్సిల్‌ ద్వారా ఒక ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే బుధవారం ఆ పార్సిల్‌ పేలింది. జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ఈ సంఘటనలో మరణించారు. 9, 10 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పార్సిల్‌ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడటంపై స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పార్శిల్‌ను ఎవరు డెలివరీ చేశారు? అది ఎందుకు పేలింది? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...