గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్ఎంపీ

Date:

ఒక యువకుడికి జ్వరం వచ్చింది.. చికిత్స కోసం తమ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లాడు. ఆ ఆర్ఎంపీ  గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఆ యువకుడి పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజుల పాటు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో సోమవారం వెలుగుచూసింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్‌ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 26న జ్వరంతో పాటు, నీరసంగా ఉండడంతో పట్టణంలోని ఫిరంగిగడ్డకు చెందిన ఆర్ఎంపీ ఆడెపు శ్రీనివాస్‌ వద్దకు వెళ్లాడు.

అతడు నవీన్‌ను పరీక్షించి కుడి, ఎడమ తొంటికి రెండు ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు సెలైన్‌ బాటిల్‌ పెట్టి అందులో మరో నాలుగు ఇంజక్షన్లు కలిపాడు. దీంతో నవీన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆర్ఎంపీ వెంటనే మరో ఇంజక్షన్‌ ఇచ్చాడు. ఇలా గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో నవీన్‌ పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు ఆర్ఎంపీని నిలదీయడంతో ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లగా నవీన్‌ కండిషన్‌ సీరియస్‌గా ఉందని చెప్పడంతో వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ ఒక రోజు ట్రీట్‌మెంట్‌ చేసిననప్పటికీ నవీన్‌ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత విషమించింది. దీంతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నవీన్‌ చనిపోవడంతో ఆర్ఎంపీ శ్రీనివాస్‌ వర్ధన్నపేట నుంచి పరార్‌ అయ్యారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ నవీన్‌ భార్య మేఘన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...