రాష్ట్రంపై నిప్పులు కురిపిస్తున్న భానుడు

Date:

తెలంగాణ రాష్ట్రంపై సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయి టెంపరేచర్లతో జనం తల్లడిల్లుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. మండే ఎండలకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రానికి ఇంకో మూడు రోజులు వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నల్గొండ జిల్లాలోని మాడ్గులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటింది. ఈ నెల 27న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...