బస్సులు ఆపడం లేదని రోడ్డుకు అడ్డంగా రాళ్లు

Date:

ఎన్ని సార్లు మొర పెట్టుకున్న ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు. ఇక చేసేదేమి లేక బస్సుల కోసం మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లడంతో మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు.

కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి తెల్కపల్లి మీదుగా లింగాలకు నడిచే బస్సులు బీఆర్ఎస్‌ హయాంలో స్టేజీల వద్ద నిలిపేవారని మాడాపూర్‌, కోమటికుంట గ్రామాలకు చెందిన మహిళలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో డ్రైవర్లు బస్సులను స్టేజీల వద్ద ఆపడం లేదని ఆరోపించారు. చేసేదేమీలేక రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన చేపట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...