బాలుడి పాదాలకు నమస్కరించిన హర్యానా సీఎం

Date:

హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నమస్కరించారు. కర్నల్‌ నగరంలోని మైదానంలో రిపబ్లిక్‌ డే వేడుకలను నిర్వహించారు. సీఎం ఖట్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అనంతరం సీఎం ఖట్టర్‌ నేరుగా ఆ చిన్నారుల వద్దకు వెళ్లి.. రాముడి వేషధారణలో ఉన్న చిన్నారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...