పాపికొండల అటవీప్రాంతంలో చెట్టుకు నీరు

Date:

నిత్యం ఏదో ఒక చోట చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ వింత ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో ఈ అద్భుతం వెలుగు చూసింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు అటవీ శాఖ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో నల్లమద్ది చెట్టు వద్దకు వచ్చిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ చెట్టు నుంచి నీరు చుక్కలు బయటకు వచ్చాయి. దీంతో వారు మరికాస్తా చెట్టు కాడను నరకగా.. అందులో నుంచి మంచినీళ్లు బయటకు ఉబికి వచ్చాయి. దీంతో అటవీ సిబ్బంది చెట్టు బెరుడును మొత్తంగా నరికేశారు. దీంతో చెట్టు నుండి వస్తున్న జలధార చూసిన అటవీ అధికారులు ఎంతో ఉత్సాహం వక్తం చేశారు. చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అటవీ సిబ్బంది తెలిపింది.

ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను ఇందుకూరు రేంజ్ అటవీ అధికారులు తాగారు. సాధారణం చెట్ల నుండి పాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల బెరడుల నుంచి పాలు రావడం సర్వసాధారణం. వాతావరణంలో మార్పులు, చెట్టు లక్షణాల కారణంగా ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...